Breaking News

ప్రఖ్యాత కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్‌

తెలుగు సాహిత్య ప్రపంచానికి అపారమైన సేవలు అందించిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) ఇకలేరు. సోమవారం ఉదయం స్వగృహంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతుండగానే ఆయన తుది శ్వాస విడిచారు.తెలంగాణ సాహిత్య రంగంలో అందెశ్రీ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన రచనలు తెలంగాణ భాషా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా నిలిచాయి. ఆయన మరణం సాహిత్యరంగానికి తీరని లోటు అని పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి