Breaking News

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన 16 మందికి జరిమానా

ఇద్దరు వ్యక్తులకు మూడు రోజులు సాధారణ జైలు శిక్ష

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భవాని కోర్టులో తీర్పునిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికిన 16 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధించారు. ఈ క్రమంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికిన మరో ఇద్దరు వ్యక్తులకు మూడు రోజులు సాధారణ జైలుశిక్ష విధించారని స్థానిక ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలుపుతూ… ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా తెలిపారు.