Breaking News

పేదల సొంతింటి కల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైంది ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ పిట్లం:

జుక్కల్ నియోజకవర్గం లోని నిరుపేదల సొంతింటి కల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు. ఆయన సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని గుడల్వార్ సవిత ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు జుక్కల్ నియోజకవర్గం లో మొదటి విడతలో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యాయని కొన్ని నిర్మాణం పూర్తి చేసుకోగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కల నెరవేరినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఒక్క పూరి గుడిసె కూడా లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే తమ ఆశయమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులు గ్రామపంచాయతీ కార్యదర్శులు హౌసింగ్ శాఖ అధికారుల అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల,ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి