Breaking News

శ్రీసోమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

-గర్భగుడి ఎదురుగా ఆకట్టుకున్న భక్తురాలి శివుడి రంగోలి చిత్రం

-శ్రీసోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు.ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు.ఉసిరి జమ్మి చెట్లకు దీపాలను వెలిగించి దీపారాధన చేశారు. చండిక అమ్మవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభ వంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, ప్రసాదం వాయినంగా అర్చకులు అందజేశారు.జనగామ జిల్లా కేంద్రానికి చెందిన పెద్ది కుసుమ భక్తురాలు కళ నైపుణ్యంతో ఆలయంలో స్వామివారి గర్భగుడికి ఎదురుగా శివుడి తపస్సు చేసిన చిత్రాన్ని రకరకాల రంగులతో అందంగా ముగ్గు రూపంలో చిత్రాన్ని గీసి ఆకట్టుకుంది.మహిళ వేసిన చిత్రానికి ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ అధికారులను అందరినీ ఆకర్షించేలా చేసింది. కుసుమ గీసిన శివుడి చిత్రానికి భక్తులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు.స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరిన భక్తులకు ఆలయ సిబ్బంది మజ్జిగను అందజేశారు, కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న, సూపర్డెంట్ కొత్తపల్లి సూపర్డెంట్ కొత్తపల్లి ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.