మనప్రగతిన్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోని ఉన్న మండల ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నిరకాలరక్త పరీక్షలు నిర్వహించాలని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ అన్నారు.నూతన డిఎంహెచ్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జే సంధ్య కిరణ్ మైను.కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీ పనులు చేసుకునే మహిళలు తమఆరోగ్యంపట్ల అశ్రద్దవహిస్తున్నారని. వారికి సరియైన అవగాహన కల్పించడం మరియు అన్ని రకాల రక్త పరీక్షలు చేయడం ద్వారా షుగర్ బీపీ క్యాన్సర్ గనేరియా వంటి వ్యాధులను నిర్ధారించాలని నూతన డీఎంహెచ్ఓను కోరారు .. ఈ కార్యక్రమంలో సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు

