మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్:
ఏన్కూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో అధికారుల మార్పు జరిగినా, బోర్డుపై మాత్రం పాత ఎంపీడీవో రంజిత్కుమార్ పేరే కొనసాగుతోంది. అక్టోబర్ 27న నూతన ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు స్వీకరించి పది రోజులు గడిచినా, పేరు మారకపోవడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజా కార్యాలయాల సమాచారం స్పష్టంగా ఉండాలని, వెంటనే కొత్త అధికారి పేరును బోర్డుపై ప్రతిబింబించాలని స్థానికులు కోరుతున్నారు.

