_ జీవనోపాధి కోల్పోయా
_ ప్రభుత్వ ఆదుకోవాలి పాడి రైతు
మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్
సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామానికి చెందిన పాడి రైతు పెంట సత్తయ్యకు జీవనోపాధి కి ఆయనకు చెందిన రెండు పాడి బర్రెలు అనారోగ్యంతో మృతిచెందాయి.ఈ రెండు బర్రెల సుమారు విలువ రెండు లక్షలయాభై వేల రూపాయలు ఉంటుంది అని తెలిపారు,తన జీవనాధారం పాడి పరిశ్రమపై ఆధారపడి ఉన్న సత్తయ్య ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాడి రైతుకు తక్షణ ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని పాడి రైతు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి, నష్టం వివరాలను పరిశీలించి తగిన పరిహారం ప్రకటించాలన్నారు.


