Breaking News

ప్రముఖ కవి అందెశ్రీ మృతి పట్ల మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం

మన ప్రగతి న్యూస్/ఖమ్మం:

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం ఎంతో బాధాకరమని బిఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజల్లో ఉత్సాహం నింపిన గేయాలు, కవితలు అందెశ్రీ కలం నుంచి వెలువడటం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని ఆయన పేర్కొన్నారు. సాహిత్య రంగంలో ఆయన లేని లోటు తీరనిదని నామ నాగేశ్వరరావు తెలిపారు.అందెశ్రీ రచనలు, భావజాలం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని నామ నాగేశ్వరరావు అన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి