-హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్.
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ హెచ్చరించారు.రౌడీ షీటర్లకు కేశపట్నం పోలీస్ స్టేషన్ లో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ రౌడీ షీటర్లు అల్లర్లు, అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.చెడు నడక కలిగిన రౌడీ షీటర్లపై పోలీసు నిఘా ఉంటుందన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. రౌడీ షీటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ సంబంధిత స్టేషన్లలో సంతకాలు చేస్తూ ఉండాలన్నారు.రౌడీ షీటర్ల కదలికలపై ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై శేఖర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

