Breaking News

అంధకారంలో అంబేద్కర్ నగర్

చీకట్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి :

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

మండల పరిధిలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో గత రెండు నెలల నుంచి మొత్తం గ్రామంలో సగానికి పైగా వీధి దీపాలు వెలగడం లేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటనల ద్వారా అధికారులకు తెలియజేసిన నేటికీ చర్యలు శూన్యం. ఇప్పటికే కోతుల వల్ల కుక్కల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు లేకపోవడం వల్ల అత్యంత చిమ్మ చీకటిగా ఉండటం వల్ల ఉదయం వేళల్లో పొలం పనులకు వెళ్లే వారికి రాత్రిపూట వచ్చే వారికి రోడ్లపై పడుకునే కుక్కలు కనిపించక అనేక ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా పంచాయతీ పరిధిలో సిమెంటు రోడ్లమీద విపరీతంగా ఇసుకపోస్తున్నారు. ఇసుక వల్ల కుక్కల వల్ల జారీ వాహనదారులు కింద పడిపోయే అవకాశం ఉంది కావున పంచాయతీ అధికారులు స్పందించి సిమెంట్ రోడ్లపై ఏమీ లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి అంబేద్కర్ నగర్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అంబేద్కర్ నగర్ గ్రామంలో విజ్ఞప్తి చేశారు.