Breaking News

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన అంబటిపల్లి బీసీ గురుకుల విద్యార్థి

మన ప్రగతి న్యూస్ /అచ్చంపేట

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించబడే స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ 17 క్రీడలు ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించడం జరిగింది ఈ క్రీడలలో కబడ్డీ విభాగము లో నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల్ అంబటిపల్లి బీసీ గురుకుల పాఠశాలకు చెందిన సి నందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తరఫున జాతీయస్థాయి కబడ్డీ క్రీడలకు ఎంపిక కావడం జరిగింది ఇది పాఠశాల యాజమాన్యానికి చాలా సంతోషకరమైన విషయమని ప్రిన్సిపల్ రజిత ఒక ప్రకటనలో తెలిపారు అదేవిధంగా ఈ విద్యార్థితోపాటు మా విద్యార్థులకు క్రీడారంగంలో ప్రోత్సహించి శిక్షణను అందిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు చాట్ల రమేష్ కృషి అనలేనిదని ప్రిన్సిపల్ కొనియాడారు అదేవిధంగా (ఏటీపీ ) ముత్యాల వెంకటేష్ మాట్లాడుతూ మా విద్యార్థి మండల స్థాయి నుంచిజిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయస్థాయికి ఎంపిక కావడం మా ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు చాలా గర్వకారణంగా ఉందని జాతీయస్థాయిలో కూడా మా విద్యార్థి ప్రతిభ చాటి మన రాష్ట్రం పేరు నిలబెడతాడని నమ్ముతున్నామని తెలిపారు

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి