Breaking News

బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మన ప్రగతి న్యూస్/వనపర్తి/అమరచింత:-

వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్ కడుమూర్ గ్రామంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమరచింత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు బాల కార్మికుల మరియు బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి అమరచింత సబ్ ఇన్స్పెక్టర్ స్వాతి మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి కూలి పనులకు వెళ్లకుండా పాఠశాలలోనే ఉంటూ విద్యను అభ్యసించాలని సూచించారు. అదేవిధంగా బాల్య వివాహాలు చేయకూడదని తెలిపారు ఒకవేళ ఎవరైనా బాల్యవివాహాలు జరిపినట్లైతే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. కావున ప్రతి విద్యార్థి తమ లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్సై స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మౌలానా, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి