Breaking News

ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన న్యాయవాదులు

అందెశ్రీ అకాల మరణానికి బార్ అసోసియేషన్ సంతాపం

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు నందు పనిచేస్తున్న న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు హాలు నందు మంగళవారం సమావేశమై ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే సోమవారం తెలంగాణ గీత రచయిత, మహాకవి అందెశ్రీ మరణించటం చాలా బాధాకరమైన విషయం అని బాధాతప్త హృదయాలతో మర్యాద పూర్వకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో మాయమైపోతున్నడమ్మా మానవత్వమున్న మనిషి అనే గేయాన్ని రచించి, సామాన్యుల గుండెల్లో స్థిరపడిపోయిన అందెశ్రీ భౌతికంగా మరణించినా ఆయన రచించిన కవితల్లో, రచనల్లో చిరకాలం జీవించే ఉంటారని అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా చేయాలని, భారతదేశంలోనే ప్రజలందరు ప్రశాంతంగా జీవించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మారం సతీష్ కుమార్ బాబు, గొంది మురళి మోహన్, లక్కినేని నరేంద్రబాబు, ముప్పిడి శ్యామ్ సుధాకర్, నల్లపు ఉదయ్, దర్గావళి బాలరాజు, అరుణ కుమారి, భవాని కృష్ణ యాదవ్ తదితర లాయర్లు పాల్గొన్నారు.