ఎస్సై బొజ్జ మహేష్ హెచ్చరిక
మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:
ఎల్లారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై బొజ్జ మహేష్ స్పష్టం చేశారు. బుధవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సై ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సై బొజ్జ మహేష్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అంటే ప్రాణాలతో చెలగాటమే. ఒక ప్రాణం అంటే ఒక కుటుంబం విలువ, అని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ వంటి అవసరమైన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, పెండింగ్లో ఉన్న చలాన్లు వెంటనే చెల్లించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ ఈ తనిఖీల్లో ఆయనతోపాటు ఎల్లారెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

