Breaking News

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

మన ప్రగతి న్యూస్/వనపర్తి/అమరచింత:-

వనపర్తి జిల్లా అమరచింత మండల శివారులోని మస్తీపురం గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారంతో అమరచింత సబ్ ఇన్స్పెక్టర్ స్వాతి వారి సిబ్బందితో కలిసి ఇసుక ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగిందని ఎస్సై తెలిపారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు. కావున ఈ సందర్భంగా ఎస్సై స్వాతి మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి లేకుండా ఇసుక,మట్టి వంటి అక్రమ రవాణాలను చేయరాదని హెచ్చరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి