మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా అధికారుల మేరకు.. నూతన భవిత సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లను స్థానిక అధికారులు ప్రారంభించగా.. స్థానిక పాఠశాల విద్యార్థులు మా పాఠశాల ఆవరణంలో భవిత సెంటర్ ను నిర్మించవద్దని మాకు పాఠశాల ఆవరణంలో నూతన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, డైనింగ్ హాల్ వంటి భవనాలను నిర్మించాలని భవిత సెంటర్ మాకు వద్దు అంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఈఓ బాలరాజ్ మాట్లాడుతూ.. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు భవితా సెంటర్ ను మధ్యాహ్న భోజనం సదుపాయం కలిగిన పాఠశాలలోనే భవిత సెంటర్ ను నిర్మించాలని ఆదేశాలు ఉన్నాయి. పాఠశాల ఆవరణంలోనే నూతన భవిత సెంటర్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

