మన ప్రతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం కేశవపట్నం బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన వెంగళ ప్రవీణ్ ఇంటికి వెళుతుండగా ,మార్గమధ్యంలో ఆగి ఉన్న టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.స్థానికుల సమాచారంతో సంఘటన చేరుకున్న ఎస్ఐ. శేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

