_ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి,
_ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ గెలుపు, సంబరాలు
మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ 25 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించినందుకు ముస్తాబాద్ పట్టణంలో పటాసులు కాలుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక సంక్షేమ అభివృద్ధి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు అని అన్నారు, ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అనేక ఆరోపణలు దూషిస్తూ పార్టీ గెలవడం కోసం అనేక ప్రయత్నాలు చేశారన్నారు, కానీ ప్రజలు ప్రజా పాలన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ విజయం వైపు మొగ్గు చూపారని అన్నారు, ఈ విజయం వచ్చే స్థానిక ఎన్నికల్లో మరింత బలాన్ని చేకూర్స్తుందని అన్నారు,
ప్రజల విశ్వాసమే ఈ విజయానికి కారణమని మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, మాజీ ఎంపిటిసి గుండెలి శ్రీనివాస్, ఉచ్చిరెడ్డి బారెడ్డి,యువ నాయకులు, మిడిదొడ్డి భాను, రంజాన్ నరేష్, ఎదునురి భానుచందర్, తాళ్ల విజయ రెడ్డి, చికోడ్ రమేష్, మండల సీనియర్ నాయకులు ,గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

