Breaking News

36 అడుగులు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం లోని శ్రీ జోగులంబ రైల్వే హల్ట్ సమీపంలో 36అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంను వేదపండితులు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. గత మూడు రోజులుగా విశిష్ట పూజలు నిర్వహించిన వేదపండితులు పంచముఖ ఆంజనేయ స్వామి రాతి విగ్రహంసీతారాములు విగ్రహాలు ధ్యాన ముద్రలో శివుడు విగ్రహలను ప్రతిష్టించారు. కార్తీక మాసం అలంపూర్ ఆలయాలకు వెళ్లే భక్తులు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో భక్తులతో సందండి నెలకొన్నది. రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎస్సై శేఖర్ తన సిబ్బంది తో కలిసి బందోబస్తు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి