మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక
మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:
బీబీనగర్:-మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా బీబీనగర్ మండలంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 4 నుండి నవంబర్ 14 వరకు సామాజిక తనిఖీ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది.నవంబర్ 15 రోజున మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రజా వేదిక నిర్వహించడం జరిగింది.424 పనులకు గాను కూలీల వేతనాలు 37,59,11 43 రూపాయలు మరియు సామాగ్రి ఖర్చులకు గాను 1,97,4571 రూపాయలు.మొత్తం రూపాయలు 3,95,657 14 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.కావున శనివారం రోజున 15వ విడత ప్రజా వేదికకు హాజరైన అడిషనల్ ఆర్డీవో సురేష్,ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి,ఏవివో ఉపేందర్ రెడ్డి,మండల పంచాయతీ అధికారి,ఏవీఎం ఆదిత్య,ఎస్ఆర్పి,ఏపీఓ,పంచాయతీ కార్యదర్శిలు మరియు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

