Breaking News

ఆగి ఉన్న లారీని ఢీకొన్న రాజధాని బస్సు ఇద్దరు ప్రయాణికుల మృతి పలువురికి గాయాలు

మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి

జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డుపై నిలిపిన ఇసుక లారీని వెనక నుంచి ఆర్టిసి రాజధాని బస్సు(TG 03Z 0046) ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం దాటికి బస్సు ఎడమభాగం ధ్వంసమైంది. మృతుల్లో ఒకరు హైదరాబాదు, మరొకరు హనుమకొండకు చెందిన వారిగా గుర్తించారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి