మన ప్రగతి న్యూస్/నడికూడ:
బాల్య వివాహాలపై అవగాహన సదస్సును నడికూడ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శని వారం రోజున పంచాయతీ కార్యదర్శి బిక్షపతి అధ్యక్షతన గ్రామ స్థాయి బాల్య వివాహాల నిరోధం మరియు నియంత్రణ కమిటి సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల వచ్చే అనర్ధాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత పాల్గొని మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి, ఆపదలో మహిళల గురించి టోల్ ఫ్రీ నెంబర్ 181 కు కాల్ చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. టిసిపిఎస్ బాలల సమగ్ర విభాగం నుండి సుజాత దేవి మాట్లాడుతూ.. పుట్టిన నుండి 18 సం”రాల వయసు గల బాలబాలిక లకు ఆపదకాలంలో తల్లిదండ్రులు లేని పిల్ల లకు మిషన్ వాత్సల్య ద్వారా లబ్ధి పొందుతారని తెలిపారు. అక్రమ దత్తత చైల్డ్ లేబర్ తదితర వాటి కై 1098 కు డయల్ చేయాలని తెలిపారు. అదే విధంగా మండల కేంద్రంలోని జడ్పీఎస్ ఎస్ పాఠశాలలో బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ఈ సమావేశంలో అంగన్వాడి టీచర్లు అనిత, కళావతి, సంపూర్ణ, వినోద, జడ్పీఎస్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎన్ఎం లు, గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


