Breaking News

ఐకెపి కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య శారద

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని ఐకెపి కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ
రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు. ప్రైవేట్ దళారులను నమ్మి రైతులు మోసపోకూడదని సూచించారు .రైతులకు ఇబ్బంది కలగకుండా దాన్యం తడవకుండా పట్టాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.కాటా వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ,సివిల్ సప్లై డిఎం సంధ్య ,ఎమ్మార్వో ముప్పు కృష్ణ ,ఎంపీడీవో శుభ నివాస్, ఏవో బన్న రజిత, ఏపీఎం సుధాకర్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి