మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ గాయాలైన ఘటన శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఆముదాలపల్లికి చెందిన కందుల రాజు తిమ్మాపూర్ వివాహ వేదికకు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో తాడికల్ గ్రామానికి చెందిన అన్వర్ పాషా, కందుల రాజు ద్విచక్ర వాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి.ఈ ఘటనలో రాజు కుడికాలు విరగగా అన్వర్ పాషాకు గాయాలయ్యాయి.స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఈ.ఎం.టి గూడూరి సతీష్ రెడ్డి ఇరువురికి ప్రధమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

