Breaking News

వేములవాడలో దారులన్నీ భీమన్న గుడివైపే. భక్తులు ఇక్కట్లు…

_ దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నార

_ ఆలయ సిబ్బందిపై భక్తులు అగ్రహం

మన ప్రగతి న్యూస్ /
వేములవాడ :

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

వేములవాడలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు వేములవాడ భీమేశ్వరాలయానికి పోటెత్తారు. ఈ సందర్భంగా పవిత్రమైన కార్తీక మాసంలో రాజన్నను దర్శించుకోవాలని వేములవాడకు వచ్చిన భక్తులు అక్కడ దర్శనాలు నిలిపివేయడంతో భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు టిక్కెట్లు దొరకక నానా ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్నారు, సామాన్య భక్తులకు ఇవ్వక టిక్కెట్లు వేరే వారికి అప్పజెప్పి బ్లాకులలో టిక్కెట్లు అమ్ముతున్నారని భక్తులు ఆలయ సిబ్బందిపై ఆగ్రహం చెందుతూ ఆందోళన చేపట్టారు,వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో స్వామివారి నిత్య కళ్యాణం టికెట్లను తగ్గించారు. గతంలో 180 టికెట్ల వరకు జారీ చేయగా, ప్రస్తుతం వాటి సంఖ్యను 70 సగానికి తగ్గించారు. దీనివలన భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ సేవలో పాల్గొనడానికి వచ్చిన భక్తులకు నిరాశ చెందుతున్నారు, తగినంత స్థలం లేకపోవడం వల్లనే టికెట్లు తగ్గించినట్లు అధికారులు తెలుపుతున్నారు, ఈ సందర్భంగా కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కళ్యాణం టికెట్ల కోసం సిఫారసులు పెరిగాయి.అని దర్శనం టికెట్లు దొరుకుతలేవని భక్తులు ఆవేదన చెందుతున్నారు భీమేశ్వరాలయం కౌంటర్ దగ్గర భక్తులందరికీ అభిషేకాలు టికెట్లు రాజన్న కళ్యాణ టికెట్లు అందరికీ అందేలా చూస్తామని ఆలయ అధికారులు అంటున్నారు,,