మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి గట్టయ్య కేశవ పట్నం నుండి తాడికల్ కు బైక్ పై బయలుదేరాడు. తాడికల్ రోడ్డు దాటుతుండగా వెనకాలే వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో గట్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.ఆటో బోల్తా పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

