- వివరాలు వెల్లడించిన ఎస్ఐ. సతీష్.
మన ప్రగతి న్యూస్/నల్గొండ/కేతేపల్లి:
హైవే పై రోడ్డు దాటే క్రమంలో.. పాదాచా రుడుని కారు ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన.. సోమవారం ఉద యం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్లపాడు గ్రామానికి చెందిన అనుముల నరేష్ అనే వ్యక్తి ఎన్ హెచ్ 365 విజయవాడ టు హైదరాబాద్ వైపు రహదారి వెంట కాలినడకన రోడ్డు దాటే క్రమంలో.. అటువైపుగా వేగంగా వస్తున్న కారు ఏపీ 09 సిజి 7789 నెంబర్ గల కారు నడుపు వ్యక్తి నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాన్ని వేగంగా నడిపి, పాదాచారుడు నరేష్ కి కారు తో అతివేగంగా వచ్చి ఢీ కొట్టగా.. నరేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు లు క్షతగాత్రుడుని అంబులెన్స్ లో నకిరేకల్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మృతి చెందాడని, మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నట్లు ఎస్ఐ. సతీష్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

