మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు సోమవారం పరీక్ష ప్యాడ్ల ను గంగిశెట్టి మదనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించారు.ట్రస్ట్ సభ్యులు జగదీష్,పాఠశాల ప్రిన్సిపల్ కే.ప్రభాకర్ చేతులమీదుగా 92 పరీక్ష ప్యాడ్లను విద్యార్థులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, సతీష్కుమార్,మధుకర్,శివశంకర్,వనజ,రజిత పాల్గొన్నారు.

