అభివృద్ధి ప్రతిపాదనలు, ప్రజా సమస్యలపై విస్తృత చర్చ
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:
ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని వైరా ఎమ్మెల్యే శ్రీ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించారు.సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నియోజకవర్గంలోని రహదారి విస్తరణ, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, విద్యాసంస్థల బలోపేతం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి తదితర పలు పనులపై ప్రత్యేక ప్రతిపాదనలు కలెక్టర్కు అందజేశారు.అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ధృవీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆధారభూత వసతుల పురోభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు.

