మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ :
మాజీ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు భూక్యా సునీత ఘన నివాళులు అర్పించారు. దేశ చరిత్రలో మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన ఇందిరాగాంధీ నాయకత్వం భారత అభివృద్ధి దిశను పూర్తిగా మార్చిందని ఆమె గుర్తుచేశారు.జమీందారీ నిర్మూలనతో సామాన్య ప్రజలకు న్యాయం చేసిన ధీశాలిగా, హరిత విప్లవం ద్వారా దేశాన్ని ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి చేసిన దూరదృష్టి అధ్యక్షురాలిగా,గరీబీ హటావో నినాదంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేతగా ఇందిరాగాంధీ సేవలు అపారమని సునీత అన్నారు.దేశ భద్రత కోసం అణుపరీక్షలు నిర్వహించి ఉక్కు మహిళగా నిలిచిన ఇందిరాగాంధీ నాయకత్వం నేటికీ దేశానికి ప్రేరణగా నిలుస్తుందని భూక్యా సునీత పేర్కొన్నారు.


