మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ పంపిణీ కార్యక్రమం లో భాగంగా మండల కేంద్రంలోని 403 మహిళా సంఘాలకు గాను 4956 చీరలు రావడం జరిగిందని ఆత్మకూరు మండల ఎపిఎం పారిజాత తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి మహిళ సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

