_ కేటీఆర్ గిఫ్ట్ స్మైల్
_ బిఆర్ఎస్ మండల ప్రజా ప్రతినిధులు
మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు చలి తీవ్రత వల్ల ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశంతో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 62 ఉన్ని దుప్పట్లను పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని బి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేసి చేతికి అందజేశారు, ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు ఏద్దండి నర్సింహా రెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య మండల బిఆర్ఎస్వి అధ్యక్షులు ఎండి నవాజ్, పోతుగల్ గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక బాల్ నర్స్, పార్టీ శ్రేణులు,హస్టల్ వార్డెన్ కర్ణాకర్, విద్యార్థులు, తదితరులు,పాల్గొన్నారు…


