-భూధాన్ పట్టణ పురవీ ధులలో
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ పురవీధులలో శ్రీ అయ్య ప్ప స్వామి ఊరేగింపు గురువారం రాత్రి వైభవో పేతంగా నిర్వహింపబడింది. స్వా మివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ -అయ్యప్ప భక్త సమాజం ఆ ధ్వర్యంలో ఈ ఊరేగింపు కార్యక్రమం నిర్వహింపబడింది. ప్రత్యేకంగా అలంకరిం పబడిన వాహనంపై అయ్యప్ప స్వామివిగ్రహంతో పాటు విగ్నేశ్వర స్వామి, జగ న్మాత విగ్రహాలను అదిష్టింప చేశారు. స్వామివారి ఆలయం నుండి ఊరేగింపు ప్రారంభమైంది. ఊరేగింపు ముందు కేరళ వాయిద్య బృందం వాయిద్యాలు మ్రోగి స్తుండగా, భారీ ఎత్తున బాణసంచా పేల్చుతూ, స్వామి మాలధారణ చేసిన భక్తు లు స్వామి భక్తి పాటలతో నృత్యాలు చేస్తుండగా ,విద్యుత్ దీపాల గొడుగులతో ఫోకస్ లైట్ల వెలుతురులో స్వామివారి ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా కొన సాగుతూ గాంధీ విగ్రహం వరకు నిర్వహింపబడింది. మాల ధరించిన భక్తులు స్వా మి భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ ఆనంద పారవశంతో తన్మయత్వం పొందారు. వీరి నృత్యాలు భక్తజనులను ఆకట్టుకున్నాయి.ప్రధాన కూడలిలో వీరిపై మెరుపు కాగితం ముక్కలు ,పువ్వుల జల్లు కురిపించారు. కన్నుల పండుగగా స్వామివారి ఊరేగింపు మహోత్సవం బ్రహ్మోత్సవాల చివరి రోజు అయిన గురువారం రాత్రి మహా వైభోపీతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు, గురుస్వాములు, స్వామి మాల ధరించిన భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ వీధులు దద్ద రిల్లాయి, అయ్యప్ప స్వామి నామం మారు మ్రోగింది. శబరి వాతావరణం నెలకొంది. రోడ్డుకి ఇరువైపులా ప్రజలు నిల్చోని స్వామివారిని దర్శిం చుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు పెద్ద పెట్టున నినదిం చారు.

