Breaking News

ర్యాష్ డ్రైవింగ్ తో ఆర్టీసీ బస్సును, ఐదు కరెంటు పోల్స్ ను ఢీ కొట్టిన వ్యాన్ డ్రైవర్

టీఎస్ ఆర్టీసీ బస్సులో ఒక ప్రయాణికుడికి తీవ్రమైన గాయాలు

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట :

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

దమ్మపేట మండలం, జాతీయ రహదారిపై ముష్టిబండ గ్రామం వద్ద టి ఎస్ ఆర్ టి సి బస్సును వ్యాన్ డ్రైవర్ మితిమించిన వేగంతో వచ్చి శనివారం ఉదయం 7:30 కు ఢీ కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా దమ్మపేట పోలీస్ ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి మండలం, నామవరం గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా వ్యాన్ ను నడిపి జాతీయ రహదారిలో వస్తున్న టీఎస్ ఆర్టీసీ సెమీ లగ్జరీ బస్సును ఢీకొట్టడంతో ఒక ప్రయాణికుడికి తీవ్ర గాయాలై ముక్కులు వెంట నోటి వెంట బ్లడ్ వస్తుందని, బస్సు డ్యామేజీ అయిందని గాయపడిన ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి ప్రధమ చికిత్స అందించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వ్యాన్ డ్రైవర్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టి 5 కరెంట్ పోల్స్ ను డీ కొట్టడంతో కరెంట్ పోల్స్ దెబ్బతిన్నాయని, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, సుమారు 30 వేల రూపాయల నష్టం జరిగిందని విద్యుత్ శాఖ ఏఈ అంబడిపూడి సాయికిరణ్ వ్యాను డ్రైవర్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.