మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ప్రధాన కూడళ్లకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నందున , ఈ దుకాణాలను పట్టణానికి కాస్త దూరంలో ఉండేలా ఏర్పాటు చేయించాలని కో రుతూ శుక్రవారం నాడు ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ కు పట్టణంలోని యువజన, కుల సంఘాల వారు పట్టణ ప్రజలు ,మహిళలు వినతి పత్రం అందజే శారు. వీరంతా అధికారి వద్దకు వెళ్లి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పద్మశాలి మహా జన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు, నేతాజీ యువజన స మాఖ్య గౌరవాధ్యక్షుడు సారా బాలయ్య, అధ్యక్షుడు గునిగంటి రమేష్ ,కొయ్యడ నరసింహ గీత పారిశ్రామికుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు గునిగంటి మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షురాలు మెరుగు శశికళ, బిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షురాలు అంజమ్మ ,శెట్టి శ్రీనివాస్ ,వెంకటయ్య, బస్వా రెడ్డి ,సుమన్ గౌడ్ తో పాటు పట్టణవాసులు ,మహిళలు పాల్గొన్నారు.

