Breaking News

పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో అదనంగా జి.పి.ఓ లను నియమించాలి

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ మహమ్మద్ లయిక్ అహ్మద్

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

భువనగిరి పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో జి.పి.ఓ (గ్రామ పంచాయతీ కార్యదర్శి)ఒక్కడే ఉండడం వల్ల పట్టణ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని మునిసిపల్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ లయిక్ అహ్మద్ అన్నారు.గతంలో వి.ఆర్.ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ముగ్గురు వీఆర్వోలు ఉండేవారని అన్నారు.ఇప్పుడు పెరిగిన వార్డులను దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఇద్దరూ జి.పి.ఓ లను నియమించాలని వారు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఇట్టి విషయం పై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని,సాధ్యమైనంత త్వరగా అదనంగా జి.పి.ఓ లను నియమించడం జరుగుతుందని వారు తెలిపరని అన్నారు.