Breaking News

వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసేందుకే చెక్ డ్యాంల నిర్మాణాలు

ఎమ్మెల్యే యశ్వినిరెడ్డి

9.35 కోట్లతో నిర్మించే చెక్ డ్యామ్ ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతోనే చెక్ డ్యామ్ ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మామిడాల యశ్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని కూడకండ్ల మండలంలోని బయన్న వాగుపై 9 కోట్ల35 లక్షల నిధులతో చేపడుతున్న చెక్ డ్యామ్ ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యశ్వినిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో రైతులు సాగు చేస్తున్న వ్యవసాయానికి సాగునీటి అవసరాలను తీర్చడంలో చెక్ డ్యామ్ లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళుతుందని అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోని వాగులపై చెక్ డ్యామ్ ల నిర్మాణాలను చేపడుతుందని తెలిపారు. బయన్న వాగు పై నిర్మించనున్న చెక్ డ్యామ్ వల్ల నీటి నిల్వ సామర్థ్యాం గ్రౌండ్ లెవెల్లో గణనీయంగా పెరుగుతుందని దీనివల్ల బోరు బావుల్లో సమృద్ధిగా నీరు ఉప్పొంగుతుందని దీంతో వ్యవసాయ రంగానికి నీటి సామర్థ్యం పెరిగి రైతులు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని అన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణ పనులను నాణ్యత పరిమాణాలతో నిర్మించాలని వర్షాకాలం కంటే ముందే డ్యామ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార బ్యాంకు వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నల్ల ఆండాలు శ్రీరాములు, వైస్ చైర్మన్ ఈ రెంటి సాయి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ సురేష్ నాయక్, మాజీ సర్పంచ్ మసరం మధుసూదన్,మాజీ ఎంపీటీసీ అందే యాకయ్య, కొడకండ్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్, తోపాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.