ఏసిబి డిఎస్పి రమేష్
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
మిషన్ భగీరథ డి ఈ సంధ్య ఏసీబీకి చిక్కడంతో మండలంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగస్తుల్లో ఆందోళన మొదలైది. ఏసీబీ డిఎస్పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం పాలకుర్తి మండలానికి చెందిన సురేష్ దేవరపుల మండలంలో మిషన్ భగీరథ పైపులై నిర్మాణ పనులను చేశాడని తెలిపారు. సురేష్ కు 1,5 వేలు బిల్లు రావలసి ఉండగా డి ఈ సంధ్య పదివేలు డిమాండ్ చేసిందని తెలిపారు. మిషన్ భగీరథ లో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి మహేందర్ కు సురేష్ ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి, స్క్రీన్ షాట్ తీసుకున్నాడని, ఫోన్ పే ద్వారా డబ్బులు మహేందర్ కు పంపించానని సురేష్ తెలిపాడని వివరించారు. సురేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో సంధ్యను ఫోన్ పే ఆధారంగా ట్రాప్ చేశామని తెలిపారు. డి ఈ సంధ్య ఫోన్ తో పాటు ప్రైవేటు ఉద్యోగి మహేందర్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఏసీబీ దాడుల్లో సిఐలు ఎస్ రాజు, ఎల్ రాజులతో పాటు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.


