Breaking News

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా ..

  • మాజీ ఎమ్మెల్యే చల్లా..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం నడికూడ మండల కేంద్రంలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు దుప్పటి రవి, తాళ్ళ మల్లయ్య, తాళ్ళ సమ్మయ్య కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పరామ ర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించి, వారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి,మాజీ వైస్ ఎంపీపీ మాజీ మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు, మాజీ ఉపసర్పంచ్ కిన్నెర మణి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, తదితరులున్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి