Breaking News

డ్వాక్రా రుణ వేధింపులతో మహిళల ఆవేదన

భట్టి కాన్వాయ్‌ను ఆపి ఫిర్యాదు చేసిన గోవిందాపురం, ఆళ్లపాడు మహిళలు

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డ్వాక్రా రుణాల పేరుతో జరుగుతున్న అధిక వసూళ్లు, బెదిరింపులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాయన్నపేట గ్రామ పర్యటన సందర్భంగా ఆళ్లపాడు, గోవిందాపురం గ్రామాల మహిళలు ఆయన కాన్వాయ్‌ను ఆపి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.మొత్తంగా సమావేశమైన మహిళలు ఉప ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. మాకు 10 లక్షల రుణం మంజూరు చేశారు, కానీ ఇప్పుడు 15 లక్షలు కట్టాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఇంటికొచ్చి బెదిరింపులు, అధిక వడ్డీలు బలవంతం చేస్తున్నారు అని వారు భట్టి విక్రమార్కకు వివరించారు.వాస్తవ రుణం కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయడం చట్టవిరుద్ధమని, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలని, మహిళలను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మహిళల ఫిర్యాదును గమనించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చర్యలు తప్పకుండా తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.