మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి:
డిసెంబర్ ఒకటో తారీకు గీత జయంతిని పురస్కరించుకొని ములకలపల్లి మండల స్థాయిలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేజీబీవీపీ జడ్పిహెచ్ఎస్ శిశు మందిర్ ఎంపీపిఎస్ పలు పాఠశాలల విద్యార్థునీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘటన కార్యదర్శి గంగాధర్ సీత విభాగం సంఘటన కార్యదర్శి గడిదేసి వెంకటేశ్వర్లు మండల ఉపాధ్యక్షులు బత్తుల సీతారాములు కార్యదర్శి కీసరి భద్రం పాఠశాల కమిటీ అధ్యక్షులు పద్దం నరసింహారావు మాతృ శక్తి మహిళలు రోశమ్మ పద్మావతి పిల్లల తల్లిదండ్రులు మరియు జిల్లా సామాజిక సమరసత ప్రముఖు గొడ్ల రాజు పుల్లూరు వేణు మరియు మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి బహుమతులు అందజేసి విద్యార్థులను ప్రోత్సహించారు.


