Breaking News

కన్నతండ్రిని చంపిన తనయుడి అరెస్ట్.

_ గూడెం గ్రామంలో సంఘటన

మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో తాగుడుకు బానిసైన కన్నతండ్రిని ముక్కు,నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపిన తనయుడిని ( కుమారుడు నీ) ముస్తాబాద్ స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్ శనివారం నాడు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వివరాలకు వెళ్తే గూడెం గ్రామానికి చెందిన పిట్టల దేవయ్య ఆగస్టు11 తేదీన మృతి చెందగా..అన్న మృతిపై తమ్ముడు లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.తండ్రి పరువు తీస్తున్నందున తానే చంపినట్లు మృతుడి కుమారుడు చందు విచారణలో ఒప్పుకున్నాడని
ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి పంపించామని సిరిసిల్ల రూలర్ సిఐ కే మొగిలి స్థానిక ఎస్సై గణేష్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు