Breaking News

భద్రతండ నుండి వైరాకి కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్

ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వైరా పర్యటనను విజయవంతం చేయాలన్న పిలుపు మేరకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సూచనలతో ఏన్కూరు మండలంలోని భద్రతండ గ్రామం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీగా వైరాకు బయలుదేరారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భగ్గు నాయక్, మొగిలి నాగరాజు, వీరబాబు, చంటి, కోటయ్య, సిద్ధి బోయిన నరసింహారావు, కోటేష్, సాయికుమార్, నరేష్, రాములు, శివ, కిషన్, బానోతు రాందాస్, లఘుపతి, బొడ్డు రమేష్, శివకుమార్, మొగిలి లింగయ్య, మొగిలి నరసింహారావు, పూనం వెంకటేశ్వర్లు, రమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.పార్టీ జెండాలు, నినాదాలతో జోష్‌గా సాగుతున్న ఈ ర్యాలీ వైరా కేంద్రంలో నాయకులను భారీగా ఆహ్వానించేందుకు ఉత్సాహంగా ముందుకు కదులుతోంది. కార్యకర్తల భారీ పాల్గొనడం ర్యాలీకి విశేష ఆకర్షణగా నిలిచింది.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి