Breaking News

సోమన్న ఆలయ ఘాట్ రోడ్డు పై రూ,5 లక్షల వ్యయం తో రేకుల షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఘాట్ రోడ్ మార్గంలో భక్తుల సౌకర్యార్థం స్వామి భక్తులు రూ. 5 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామానికి చెందిన వంగ.సోమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించే భక్తులకు ఎండాకాలం, వర్షాకాలం ఇబ్బందులు కలగకుండా ఘాట్ రోడ్ మార్గంలో సుమారు రూ. 5 లక్షల వ్యయంతో రేకులతో షెడ్డు నిర్మాణ పనులను చేపట్టినట్లు పర్యవేక్షకులు కొత్తపల్లి వెంకటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..