Breaking News

కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బిందర్ వర్తక సంఘం భవనంలో భవన ఇతర నిర్మాణ రంగాల కార్మిక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా బాన్సువాడ లేబర్ ఆఫీసర్ కమ్రుద్దీన్ విచ్చేశారు ప్రతి కార్మికుడు లేబర్ కార్డు తీసుకొని సంక్షేమ మండలి నుండి అందుతున్న సంక్షేమ ఫలాలనుపొందాలని భావన ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేసే ప్రతి కార్మికునికి తప్పనిసరిగా లేబర్ కార్డు ఉండాలని చెప్పడం జరిగింది ఇతర సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతికార్మికునికి తప్పనిసరిగా లేబర్ కార్డు ఉండాలని ఏదైనా సమస్యలు ఉంటే కార్మిక నాయకుల దృష్టికి తెస్తే అది పరిష్కరించడంజరుగుతుందని తెలపడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ మరియు బెల్దార్ తుకారాం అన్నగారికి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అవుటి.బాబు, ధ్యానబోయిన.శ్యామ్, గణేష్ మేస్త్రి, ఉప్పరి సంఘం అధ్యక్షులు లింగం, జిల్లా అధ్యక్షులు అశోక్, కార్పెంటర్ వడ్ల సంఘం అధ్యక్షులు నర్సింలు, పెయింటర్ సంఘం మాజీ అధ్యక్షులు కంతీ.పద్మారావు.మాదిగ, జిల్లా నాయకులు అబ్దుల్.రజాక్, ఏర్ల.సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..