మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి:
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి రఘునాథపల్లి మండలం కాంచనపల్లి గ్రామంలో ఉప్పలమ్మ ఇంట్లో దొంగలు చొరబడి దొంగతనం చేశారు.. ఇల్లు కట్టుకునేందుకు ఇంట్లో లక్ష రూపాయల నగదు మూడు తులాల బంగారం ఉంచుకోగా దొంగలు ఇదే అదనంగా భావించి దొంగతనం చేశారు. దొంగలతో భయంతో ప్రజలు ఉన్నారు.. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇటీవల రఘునాథపల్లి మండల కేంద్రంలో.. మొన్న బానాజీ పేట గ్రామంలో.. ఇప్పుడు కంచన పెళ్లి లో చోరీ జరిగింది.

