Breaking News

మొక్కజొన్న విత్తనాల వేసే విధానాన్ని పరిశీలించిన ఏవో బాలాజీ

యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగుకు రైతుల ఆదరణ

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

కొణిజర్ల మండలంలో యాసంగి పంట సీజన్‌ కోసం రైతులు మొక్కజొన్న మరియు విత్తన మొక్కజొన్న సాగుకు పెద్దపీట వేస్తున్నారు. నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారంలోపే విత్తనాలు వేస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యమైన విత్తనాలు పూత దశలో ఎండ తీవ్రత కారణంగా సరైన పాలినేషన్ జరగక దిగుబడులు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.యాసంగి మొక్కజొన్నలో జింక్ లోపం ఎక్కువగా కనిపించే దృష్ట్యా ఎకరాకు 20 కిలోల జింక్‌ను చివరి దుక్కిలో వేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఒక ఎకరాకు 8 కిలోల విత్తనాలు, నత్రజని 96 కిలోలు, భాస్వరం 32 కిలోలు, పోటాష్ 32 కిలోలు అవసరమని తెలిపారు. భాస్వరాన్ని చివరి దుక్కిలోనే, మిగతా ఎరువులను మూడు దఫాలుగా, విత్తే సమయంలో, మోకాలు దశలో, పూత దశలో వేయాలన్నారు.యూరియా మోతాదును మించి వేయకూడదని అధికారులు హెచ్చరించారు. అధిక యూరియా వల్ల మొక్కలు సన్నగా పెరగడం, కత్తిర పురుగు నష్టం, తుఫాన్ల సమయంలో మొక్కలు కూలిపోవడం, చిన్న చిన్న కండెలు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయని తెలిపారు.బోదెల పద్ధతిలో విత్తితే ఎకరాకు సుమారు 33,400 మొక్కలు లభిస్తాయని అధికారులు సూచించారు. విత్తనాల సమయంలో కలుపు నివారణ యాజమాన్యం కీలకమని కూడా గుర్తుచేశారు.కూలీల కొరతను దృష్టిలో పెట్టుకొని అన్నవరం గ్రామంలోని రైతులు విత్తనాల మిషన్‌తో సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ మొక్కజొన్న విత్తనాల వేసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు ,తదితరులు పాల్గొన్నారు.