మన ప్రగతి న్యూస్/ములకలపల్లి:
ములకలపల్లి గ్రామంలో సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ములకలపల్లి చెందిన భాస్కరని అయ్యప్ప రాజు కుమారుడు మితాన్ష్ వర్మ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరాటి రమేష్ చిన్నారిని ఆశీర్వదించారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోటి కాంతుల చిరునవ్వులతో, భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్దం దీపక్, అనుముల సాయి, నుపా రవిచంద్ర, ఇమాన్యుల్ తదితరులు పాల్గొన్నారు.

