Breaking News

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పని చేయాలి

టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్

చెర్లపాలెంలో బిఆర్ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బ

కీలక నేతలు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ లో చేరికలు

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

మనప్రగతిన్యూ/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టితో కలిసి పనిచేయాలని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో స్థానిక ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకులు పెద్ద ఎత్తున టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశ్విసినిరెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలతో పాటు విధ పార్టీలకు చెందిన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. జరగబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారు చెర్లపాలెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ సట్ల నాగలక్ష్మి, మాజీ ఎంపీటీసీ ధర్మారావు కిరణ్ తోపాటు సుమారు వంద మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులతో కలిసి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన నాయకులకు కార్యకర్తలకు ఝాన్సీ రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.