Breaking News

కాంగ్రెస్ పార్టీ అందించే సంక్షేమం అభివృద్ధిని ప్రతి ఓటరుకి వివరించాలి: ఎమ్మెల్యే జారే

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి:

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 11, 14, 17 తేదీలలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పార్టీ శ్రేణులు సమగ్ర వ్యూహంతో ముందుకు సాగాలని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచించారు ములకలపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న గారితో కలసి సమీక్ష నిర్వహించారు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు గ్రామస్థాయిలో పార్టీ బలపడేందుకు ప్రతి కార్యకర్త ఓటరు వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు వివరించాలన్నారు అభ్యర్థుల ఎంపిక నుండి పోలింగ్ డే వరకు ప్రతి దశలో సమన్వయం ఉండే విధంగా బూత్ వారీ కమిటీలను మరింత శక్తివంతంగా తయారు చేయాలని సూచించారు గ్రామ స్థాయి సమస్యలను కార్యాచరణ ప్రణాళికలో భాగం చేసుకొని ప్రజల్లో నమ్మకం పెంపొందించాలన్నారు అంతర్గతంగా ఐక్యంతో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు సులభమవుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో అన్నపురెడ్డిపల్లి మండలకేంద్రానికి చెందిన వివిధ పార్టీల పలు కుటుంబాల వారు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి